ఏపీ మంత్రులకు సోమువీర్రాజు వార్నింగ్ !

-

ఏపీ మంత్రులకు సోమువీర్రాజు వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని సోము వీర్రాజు ఇచ్చారు. బీజేపీని విమర్శించే ముందు ఆలోచించి మాట్లాడాలని ఆయన సూచనలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది మేమే అని గుర్తుపెట్టుకోండి అంటూ సోము వీర్రాజు హెచ్చరించారు. మీ నాయకుడు ఢిల్లీ వెళ్లి మా నాయకులను కలుస్తున్నారనే విషయాన్ని మర్చిపోవద్దని ఆయన అన్నారు.

ఇక మరో పక్క ఆయన నిన్న సీఎం అనే అంశం మీద కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు బీసీ సీఎంపై మాట మార్చేసాడు.     బీసీలను సీఎం చేసే దమ్ము చంద్రబాబుకు, జగన్‌కు ఉందా? అని నిన్న ప్రశ్నించిన సోము వీర్రాజు,    బీసీలను సీఎం చేసే దమ్ము ఒక్క బీజేపీకే ఉందని అన్నారు. ఇక ఈరోజు ఏమో  ఏపీలో సీఎం అభ్యర్థి ఎవరు అనేది తన చేతుల్లో లేదని చెప్పారు. సీఎం అభ్యర్థి ఎవరో నడ్డా, పవన్‌కల్యాణ్ కలిసి నిర్ణయిస్తారని,  సీఎంగా బీసీలు కావొచ్చు, కాపులు కావొచ్చని అన్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news