ఏపీలో ప్రభుత్వం ఉందా..? ఎమర్జెన్సీ ఉందా? : సోమువీర్రాజు

-

పోలీసుల తీరుపై ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ కార్యాలయం ముట్టడికి బయలు దేరిన తనను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత మంది పోలీసులు ఎందుకు వచ్చారంటూ సీరియస్ అయ్యారు. తక్షణమే తన ఇంటి నుంచి వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. ఏపీలో ప్రభుత్వం ఉందా..? ఎమర్జెన్సీ ఉందా? అని ప్రశ్నించారు ఏపీ బీజేపీ చీఫ్‌ సోమువీర్రాజు.

ఆలయాల విగ్రహాల ధ్వంసం కేసులో ముందు రాజకీయ పార్టీల ప్రమేయం లేదని చెప్పి.. ఆ తర్వాత పార్టీల పేర్లు చెప్పారని ఆరోపించారు.దేవాలయాలపై దాడులకు నిరసనగానే రథయాత్ర నిర్వహిస్తున్నామన్నారు సోము వీర్రాజు. నిజానికి ఈరోజు ఉదయం విజయవాడ వస్తున్న బీజేపీ నేతలు అందరినీ అరెస్ట్ చేయడానికి పోలీసులు యత్నించారు. ఈ క్రమంలోనే సోము వీర్రాజు ఇంటికి వెళ్ళిన పోలీసుల మీద అయన సీరియస్ అయ్యారు. 

Read more RELATED
Recommended to you

Latest news