విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన సోనూసూద్

-

ప్రస్తుతం సోనూసూద్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ సేతు హిమాల‌యాల నుంచి ఇటు వింధ్యా ప‌ర్వతాల దాకా ఆయ‌న పేరునే జ‌పిస్తోంది. రీల్ లైఫ్ లో విల‌న్ అయినా.. రియ‌ల్ లైఫ్ హీరోగా జ‌నాల గుండెల్లో నిలిచిపోయారు. కరోనా టైం లో చాలా మందికి సోనూసూద్‌ సహాయం చేశారు.  అయితే.. పేదల దైవమైన సోనూసూద్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు.

sonu sood

విద్యార్థుల కోసం కొత్త ఆఫర్‌ ప్రకటించారు. యూనివర్సల్‌ ఎడ్యుకేషన్‌ సహాకారం తో సోనూసూద్‌ ఛారిటీ ఫౌండేషన్‌ తరఫున ముంబై లో ఇంటర్‌, గ్రాడ్యుయేషన్‌, ఇంజినీరింగ్‌, బీ ఈడీ మరియు ఆర్కిటెక్చర్‌ లాంటి కోర్సులను ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు సోనూసూద్‌. ఇందు కోసం దేశం లో ఎవరైనా.. soodcharityfoundations.org/ లో రిజిస్టర్‌ చేసుకోవాలని చెప్పారు. సోనూసూద్‌ ఇప్పటికే సీఏ, లా కోర్సులు ఉచితంగా అందిస్తున్నారు. స్కాలర్‌ షిప్స్‌ కూడా ఇస్తున్నారు. తాజాగా ఇంటర్ మరియు ఇంజినీరింగ్‌ కోర్సులను ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news