కంగ‌నాపై సోనూసూద్‌ ఫైర్..!

-

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వ్యవహారం రోజురోజుకి ముదిరిపోతుంది. నిత్యం ఎవరో ఒకరిపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. అలాగే ముంబై రావొద్దంటూ తనను బెదిరిస్తున్న వారిని సవాల్ చేస్తూ కంగనా సెప్టెంబర్ 9న ముంబైలో అడుగుపెడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దమ్మున్నవాళ్లెవరో తనను ఆపుకోవచ్చని, ముంభై ఏమైనా పీఓకే నా అంటూ కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది.

ముంబైను పీఓకేతో పోల్చినందుకు సోనూసూద్‌తో పాటు పలువురు స్టార్స్ ఆమెపై మండిప‌డుతున్నారు. ఈ నగరానికి న‌మ‌స్క‌రిస్తే పుర‌స్కారం ల‌భిస్తుంద‌ని సోనూ ట్వీట్ చేశారు. ఇది ఇలా ఉంటే.. కంగనా రనౌత్‌కు కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేత రాందాస్ అథవాలే మద్దతుగా నిలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news