ASIA CUP 2022 : టీమిండియా కు షాక్…ఆసియా కప్ నుంచి జడేజా ఔట్

-

ఆసియా కప్ 2022లో భారత్ సూపర్ 4 దశకు చేరుకుంది. దుబాయ్ వేదికగా బుధవారం జరిగిన పోరులో పసికూన హాంకాంగ్ పై టీమిండియా 40 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ లో భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బ్యాట్ తో మెరిస్తే.. హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్, బౌలింగ్ లో అదరగొట్టాడు. అయితే తాజాగా టీమిండియా కు ఎదురు దెబ్బ తగిలింది. మోకాలి గాయంతో స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.

రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్ ని జట్టులోకి తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లో రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్ ను ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అక్షర్ త్వరలో జట్టుతో కలుస్తాడని పేర్కొంది. ప్రస్తుతం టీమిండియా జట్టు వివరాలు ఇలా ఉన్నాయి..రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ , R. అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్

Read more RELATED
Recommended to you

Latest news