IPL 2024 టోర్నమెంట్‌ కు ముందుకు RCBకి బిగ్‌ షాక్‌

-

 

ఐపీఎల్ ముంగిట ఆర్సిబి జట్టుకు బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఆ జట్టు బౌలర్ రీస్ టోప్లీ ప్రస్తుతం గాయంతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమయ్యే పాకిస్తాన్ సూపర్ లీగ్ లో పాల్గొనేందుకు అతడికి ఇంగ్లాండ్ NOC జారీ చేయలేదు. PSL-9లో ముల్తాన్ సుల్తాన్స్ జట్టుకు ఆడాల్సి ఉండగా దూరం అయ్యారు. ఐపీఎల్ ఆడటంపైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతేడాది కేవలం ఒక మ్యాచ్ ఆడిన టోప్లీ భుజం గాయంతో దూరమైన విషయం తెలిసిందే.

Bad news for RCB team ahead of IP

ఇక అటు నాయకత్వం మార్పుతో MI జట్టు రెండు గ్రూపులుగా చీలిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. రోహిత్, సూర్య, బుమ్రా ఒక టీమ్ గా ఉండగా….హార్దిక్, ఇషాన్ తదితర ఆటగాళ్లు మరో గ్రూప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి అర్ధాంతరంగా స్వదేశానికి వచ్చిన ఇషాన్ రంజీ మ్యాచులు ఆడకుండా హార్దిక్ తో కలిసి ప్రాక్టీస్ చేయడం ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది. ఈ పరిమాణాలతో వచ్చే ఐపీఎల్ లో MI ప్రదర్శన ఎలా ఉంటుందన్నది వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news