ఫ్లోరిడా టీ 20: ఇరు జట్లకు చాలా కీలకం … విజయం ఎవరికి దక్కేనో !

-

ఈ రోజు అమెరికాలోని ఫ్లోరిడా లో నాలుగవ మరియు చాలా కీలకం అయిన మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన మూడు టీ 20 లలో వెస్ట్ ఇండీస్ రెండు మ్యాచ్ లలో మరియు ఇండియా ఒక మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను ఆసక్తికరంగా మార్చేశాయి. ఇక మిగిలిన రెండు మ్యాచ్ లలో వెస్ట్ ఇండీస్ ఏ ఒక్కటి గెలిచినా సిరీస్ ను సొంతం చేసుకుంటుంది.. అలా కాకుండా ఇండియా రెండు మ్యాచ్ లలో గెలిస్తేనే సిరీస్ దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ రోజు జరగబోయే మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకం అయినది. ఇక తుది జట్టు విషయానికి వస్తే గత మ్యాచ్ లో గెలిచినా జట్టుతోనే ఇండియా బరిలోకి దిగే అవకాశం ఉంది.

గత మ్యాచ్ లో టీ 20 తో డెబ్యూ చేసిన యశస్వి జైస్వాల్ కు మరో ఛాన్స్ కూడా దక్కడం పక్కా అని తెలుస్తోంది. బౌలర్ ముఖేష్ కుమార్ కు బదులుగా ఇంకొకరిని ప్రయత్నిస్తే మంచిదని సీనియర్స్ అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news