సౌతాఫ్రికా వ‌న్డే సిరీస్‌కు జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ

-

టీమిండియా ప్ర‌స్తుతం సౌతాఫ్రికా టూర్ లో ఉన్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం సౌతాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్ ఆడుతుంది. దీని త‌ర్వాత మూడు వ‌న్డే మ్యాచ్‌ల సిరీస్ ఆడ‌నుంది. ఈ వన్డే సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్ర‌క‌టించింది. అంద‌రూ అనుకున్న‌ట్టే ఈ వ‌న్డే సిరీస్ కు కెప్టెన్ గా కెఎల్ రాహుల్ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. అలాగే వైస్ కెప్టెన్ గా బౌల‌ర్ జ‌స్ప్రిత్ బుమ్రా ను బీసీసీఐ నిర్ణ‌యించింది.

అలాగే ఈ వ‌న్డే సిరీస్ కు ఫిట్ నెస్ కార‌ణంగా రోహిత్ శ‌ర్మ దూరంగా ఉంటున్నాడు. అలాగే కోహ్లి అందుబాటులో ఉన్నాడు. అలాగే జ‌ట్టులోకి కొత్త గా యువ సంచ‌ల‌నాలు రుతురాజ్ గైక్వాడ్, వెంక‌టేశ్ అయ్యార్ వచ్చారు. వికెట్ కీప‌ర్లుగా రిషభ్ పంత్, ఇషాన్ కిషాన్ ల‌ను ఎంచుకున్నారు. కాగ ఈ నెల 19 నుంచి భార‌త్, సౌత్ ఆఫ్రికా మ‌ధ్య మూడు వ‌న్డేల సిరీస్ ప్రారంభం కానుంది. కాగ మొత్తం జ‌ట్టు వివరాలు ఇలా ఉన్నాయి.

జ‌ట్టు : కెఎల్ రాహుల్ ( కెప్టెన్), బుమ్రా ( వైస్ కెప్టెన్ ), శిఖ‌ర్ ధావ‌న్, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయ‌స్ అయ్యార్, వెంక‌టేష్ అయ్యార్, సూర్య కుమార్, ఇషాన్ కిషాన్, రిషభ్ పంత్, చాహ‌ల్, అశ్విన్, దీప‌క్ చాహ‌ర్, భూవ‌నేశ్వ‌ర్, సిరాజ్, శార్థూల్ ఠాకూర్, ప్ర‌సిద్ధ కృష్ణ, న‌వ‌దీప్ సైనీ, జ‌యంత్ యాద‌వ్

Read more RELATED
Recommended to you

Latest news