ప్రక్షాళన బాట పట్టిన చెన్నై సూపర్ కింగ్స్.. ఆ ఇద్దరిని వదిలించుకోనుందా?

-

ఐపీఎల్ లో అందరికీ హాట్ ఫేవరేట్ గా నిలిచే జట్టు ఏదైనా ఉందంటే అది చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే. ధోనీ ఉన్నాడనో, లేక వరుసగా విజయాలు అందుకుంటుందనో తెలియదు కానీ చెన్ని సూపర్ కింగ్స్ జట్టుకి ఉన్నంత ఫ్యాన్స్ మరో జట్టుకి లేదంటే అతిశయోక్తి కాదు. ఐతే ప్రతీ సీజన్లో తమ ఆటతో అందరినీ ఆకట్టుకున్న చెన్నై టీమ్, గత సీజన్లో బోల్తా పడింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్ కోసం ప్రక్షాళన మొదలెట్టింది.

జట్టులో కొందరు ఆటగాళ్లని వదులుకుని, వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవాలని చూస్తుంది. అలా వదులుకోవాలని చూస్తున్న వారిలో మురళీ విజయ్, పీయూష్ చావ్లా మొదటి స్థానంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆరుకోట్లకి పైగా డబ్బులు పెట్టి తీసుకున్న పీయూష్ చావ్లా సరిగ్గా రాణించలేకపోయాడు. దాంతో అతనికి ఉద్వాసన పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా కేదార్ జాదవ్, సురేశ్ రైనాలపై కూడా వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news