ధోనీ మీరు కన్నీరు పెట్టారని నాకు తెలుసు: సాక్షి సింగ్

-

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ నుంచి వీడ్కోలు పలకడంపై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో వీడ్కోలు చెప్తున్నారు. ధోనీ భార్య సాక్షీ సింగ్ కూడా తన అభిప్రాయం చెప్పింది. ఈ ఎమోష‌న‌ల్ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేశారు. మీరు సాధించినదానికి గర్వపడాలని ఆమె పేర్కొంది. ఆటలో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ ఇచ్చినందుకు అభినందనలని వ్యాఖ్యానించింది.

మీ అభిరుచికి మీరు వీడ్కోలు పలుకుతున్న‌ప్పుడు మీరు కన్నీటిని ఆపుకోలేక‌పోయార‌ని నాకు తెలుసని ఆమె రాసుకొచ్చింది. మీ ఉత్త‌మ భవిష్యత్తుకు శుభాకాంక్షలని చెప్పింది ఆమె. ఆమెతో పాటుగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ సామాజిక వేదికల ద్వారా ధోనీ సేవలను గుర్తు చేస్తూ కొనియాడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ధోనీకి భారీగా ఫాన్స్ ఉన్న విషయం విదితమే.

Read more RELATED
Recommended to you

Latest news