ధోనీ రిటైర్మెంట్‌ పై మ‌హేష్ బాబు ఎమోషనల్..!

-

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు గత రాత్రి ప్రకటించాడు. దీంతో సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకూ ఎంతోమంది ధోనీ రిటైర్మెంట్‌పై స్పందిస్తున్నారు. కాగా, తాజాగా దీనిపై సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స్పందించారు. ‘2011 వన్డే ప్రపంచకప్‌లో సిక్సర్ బాది భారత్‌కు ప్రపంచకప్ అందించిన ఉద్వేగభరితమైన దృశ్యంకి సంబంధించిన పోస్టర్ షేర్ చేస్తూ.. ఆ ఐకానిక్ సిక్సర్‌ను ఎలా మరచిపోగలం. 2011 ప్రపంచకప్ ఛాంపియన్స్ !! వాంఖడే స్టేడియంలో ఉన్నట్టు ఉంది. ఆ సన్నివేశాలు తలచుకుంటే గర్వంగా ఉంది. ఎమోషనల్ అవుతున్నా. క్రికెట్ ఎప్పటికీ ఒకేలా ఉండదు’ అంటూ మహేష్ ట్వీట్ చేశారు.

ధోని రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డంతో సోష‌ల్ మీడియాలో ఆయ‌న పేరు మారు మ్రోగిపోతుంది. ఇకపోతే టీ 20 వరల్డ్ కప్ తర్వాత ధోని రిటైర్ అవుతారేమోనని అందరు భావిస్తున్న తరుణంలో ధోని నిన్న రాత్రి తన రిటైర్మెంట్‌ ను ప్రకటించాడు.

Read more RELATED
Recommended to you

Latest news