IPL 2022 : దుమ్ములేపిన బౌలర్లు..ఢిల్లీని చిత్తు చేసిన ధోనీ సేన

-

ఢిల్లీపై చెన్నై గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. మంచి పామ్‌లో ఉన్న ఢిల్లీపై 91 పరుగుల తేడాతో ధోని సేన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఢిల్లీ 117 పరుగులకే ఆలౌటైంది. ఢిల్లీ బ్యాటర్లలో మిచెల్‌ మార్ష్‌ 25, శార్దూల్‌ 24, పంత్‌ 21, వార్నర్‌ 19 మాత్రమే రెండంకెల స్కోర్‌ ను సాధించారు.

చెన్నై బౌలర్లలో మొయిన్‌ అలీ 3, బ్రావో 2, ముకేశ్‌ చౌదరి 2, సిమర్‌ జిత్‌ సింగ్‌ 2, తీక్షణ ఒక వికెట్‌ తీశారు. ఈ ఓటమితో ఢిల్ఈ తన ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

మరోవైపు అద్భుత విజయం సాధించిన చెన్నై పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరుకుంది. కాగా.. అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు భారీ స్కోర్‌ చేసింది. నిర్నీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అయితే.. లక్ష్య చేధనలో ఢిల్లీ 117 పరుగులకే ఆలౌటైంది.

Read more RELATED
Recommended to you

Latest news