IPL 2022 : సురేశ్ రైనా అభిమానుల‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ లోకి రీ ఎంట్రీ

-

ఐపీఎల్ హీరో అని ఫ్యాన్ పిలుచుకునే సురేశ్ రైనా మెగా వేలంలో ఫ్రాంచైజీలు కొనుగోలు చేయ‌డానికి ఇష్ట ప‌డ‌లేదు. దీంతో సురేశ్ రైనా.. ఇటీవ‌ల జ‌రిగిన మెగా వేలంలో ఆన్ సోల్డ్ గా మిగిలిపోయాడు. దీంతో ఐపీఎల్ హీరో సురేశ్ రైనా అభిమానులు తీవ్ర నిరాశ‌కు గురి అయ్యారు. అయితే తాజా గా ఐపీఎల్ నుంచి సురేశ్ రైనా అభిమానుల‌కు గుడ్ న్యూస్ వ‌చ్చింది. ఈ ఏడాది సురేశ్ రైనా ఐపీఎల్ లో కనిపించ‌బోతున్నాడని తెలుస్తుంది.

అయితే ఆటగాడిగా కాకుండా.. కామెంటేట‌ర్ గా కొత్త అవ‌తారం ఎత్తేందుకు సురేశ్ రైనా సిద్ధం అవుతున్న‌ట్టు స‌మాచారం. సురేశ్ రైనాతో పాటు టీమిండియా మాజీ హెడ్ కోచ్ ర‌వి శాస్త్రి కూడా కామెంటేట‌ర్ గా క‌నిపించ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. సురేశ్ రైనా, ర‌వి శాస్త్రి ఇద్ద‌రు కూడా హింది కామెంటేట‌ర్లుగా చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

కాగ ర‌వి శాస్త్రి ఇప్ప‌టికే కామెంటేట‌ర్ గా ప‌ని చేసిన అనుభవం ఉంది. గ‌తంలో స్టార్ స్పోర్ట్స్ లో ఇంగ్లీంష్ కామెంటేట‌ర్ గా ప‌ని చేశాడు. కానీ సురేశ్ రైనా.. మైదానంలో సిక్స్ లు బాద‌డం త‌ప్ప ఎప్పుడు కూడా కామెంటేట‌ర్ గా ప‌ని చేయ‌లేడు. క్రికెట్ ఆట‌గాడిగా ఎన్నో రికార్డులు నెల‌కొల్పిన సురేశ్ రైనా.. ఇప్పుడు కామెంటేట‌ర్ గా ఎలా చేస్తాడో చూడాలి మ‌రి.

Read more RELATED
Recommended to you

Latest news