IPL 2022 : లక్నోపై గ్రాండ్ విక్టరీ.. ప్లేఆఫ్ చేరిన గుజరాత్

-

ఐపీఎల్‌ మెగా టోర్నీలో ప్లే ఆఫ్స్‌ కు ముందట లక్నోకు గుజరాత్ షాకిచ్చి… పాయింట్ల పట్టికలో టాప్‌ లోకి దూసుకెళ్లింది. ఫలితంగా ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో తొమ్మిందింటిలో గెలిచి.. హార్ధిక్‌ సేన అధికారికంగా తొలి ప్లే ఆఫ్‌ బెర్త్‌ ను ఖాయం చేసుకుంది. లక్నో తో జరిగిన మ్యాచ్‌ లో గుజరాత్‌ 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

145 పరుగుల మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 13.5 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌటైంది. లక్నో బ్యాటర్లలో దీపక్‌ హుడా టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

మిగతా బ్యాటర్లలో డికాక్‌ 11, కేఎల్‌ రాహుళ్ 8, కరణ్‌ శర్మ4, కృనాళ్‌ పాండ్య 5, ఆయూష్‌ బదోని 8, స్టొయినీస్‌ 2, హోల్డర్‌ 1, మోసిన్‌ ఖాన్‌ 1, పరుగులు చేశారు. ఇక గుజరాత్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ 4 వికెట్లు, యశ్ దయాల్‌ 2 వికెట్లు, సాయికిషోర్‌ 2 వికెట్లు, షమి 1 వికెట్‌ పడగొట్టారు. దీంతో.. 145 పరుగుల మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 13.5 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌటైంది. దీంతో ప్లే ఆఫ్స్‌ లోకి దూసుకెళ్లింది గుజరాత్‌.

Read more RELATED
Recommended to you

Latest news