IPL 2022 : గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్.. విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ ఐపీఎల్‌కు దూరం

-

ఐపీఎల్ – 2022 మార్చి 26 నుంచి ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. కాగ ఈ ఏడాది గుజ‌రాత్ తో పాటు ల‌క్నో రెండు ఫ్రొంచైజీలు ఆడ‌బోతున్నాయి. ఇప్ప‌టికే జ‌రిగిన మెగా వేలంలోనూ ఈ రెండు కొత్త ప్రొంఛైజీలు నాణ్య‌మైన ఆట‌గాళ్ల‌ను కొనుగోళు చేశాయి. కాగ ఐపీఎల్ ప్రారంభానికి ముందు కొత్త జ‌ట్టు గుజరాత్ టైటాన్స్ పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. ఇటీవ‌ల జ‌రిగిన మెగా వేలంలో కొనుగోలు చేసిన విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ ఇంగ్లాండ్ స్టార్ ఆట‌గాడు జేస‌న్ రాయ్.. ఐపీఎల్ – 2022కు పూర్తి దూరంగా ఉంటున్న‌ట్టు ప్ర‌క‌టించాడు.

బ‌యో బ‌బుల్ ఒత్తిడి ఎక్క‌వు ఉంద‌నే కార‌ణంతోనే తాను ఐపీఎల్ – 2022 కు దూరంగా ఉంటున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. అలాగే తాను ఫ్యామిలీతోనూ గ‌డ‌పాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపాడు. కాగ ఈ ఏడాది మొద‌ట్లో జేస‌న్ రాయ్ రెండో భార్య పాప‌కు జ‌న్మ‌నిచ్చింది. దీంతో కుటుంబంతో కాస్త స‌మ‌యాన్ని గ‌డ‌పాల‌ని అనుకున్న‌ట్టు తెలిపారు. కాగ జేస‌న్ రాయ్ గ‌తంలోనూ ఐపీఎల్ కూ దూరం అయ్యాడు. 2020 లో ఢిల్లీ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించాల్సింది. కానీ అప్పుడు ఐపీఎల్ లో పాల్గొన‌లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version