ఐపీఎల్ 2023: “షమీ – రషీద్ ఖాన్” లలో పర్పుల్ క్యాప్ విజేత ఎవరు కానున్నారు !

-

ఐపీఎల్ లో సీజన్ మొత్తం అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కు పర్పుల్ క్యాప్ ను బహుకరిస్తారు. ఐపీఎల్ లో ఆడే బౌలర్ కు ఇది ఒక కల లాంటిది అని చెప్పాలి. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో పర్పుల్ కాప్ ను అందుకునే అవకాశం ఉన్నది కేవలం ఇద్దరి బౌలర్లకు మాత్రమే. ఇద్దరూ కూడా గుజరాత్ టైటాన్స్ జట్టుకు చెందిన ఆటగాళ్లే కావడం గమనార్హం. ఒకరు పేస్ బౌలర్ మహమ్మద్ షమీ కాగా , మరొకరు ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్. మహమ్మద్ షమీ తన పదునైన బంతులతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించి పవర్ ప్లే లోనే అధికంగా వికెట్లను సాధించాడు. ప్రస్తుతం షమీ 15 మ్యాచ్ లలో 26 వికెట్లు పడగొట్టి మొదటి స్థానంలో నిలిచాడు. కాగా రషీద్ ఖాన్ 15 మ్యాచ్ లలో 25 వికెట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచాడు.

ఈ రోజు ముంబై తో ఆడనున్న మ్యాచ్ లో ఎవరు ఎక్కువ వికెట్లు తీస్తే ఒకవేళ మ్యాచ్ ఓడిపోయినా వారే పర్పుల్ క్యాప్ ను దక్కించుకుంటారు. మరి షమీ రషీద్ లలో ఎవరు ఈ ఘనతను అందుకుంటారో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news