Breaking : ఢిల్లీకి చేరుకున్న సీఎం జగన్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. 6.30 గంటలకు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో జగన్ సమావేశం అవుతారు. రేపు నీతి ఆయోగ్ సమావేశంలో జగన్ పాల్గొననున్నారు. ఎల్లుండి కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. నీతి ఆయోగ్ సమావేశాన్ని, కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి.

AP CM Jagan Mohan Reddy Special Flight Landing at Puttaparthi Airport in  Ananthapuram - YouTube

అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ కోసం కూడా ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరితో పాటు కీలక శాఖల మంత్రుల అపాయింట్మెంట్‌ను కూడా కోరినట్లు సమాచారం. ఈ భేటీలకు సంబంధించి వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నీ దగ్గరుండి చూస్తున్నారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మొదట అమిత్ షా.. ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలుసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news