CSK ఫ్యాన్స్ తో జడేజా ప్రాంక్.. వీడియో వైరల్

-

టీమ్ ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సీఎస్కే కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్స్తో ప్రాంక్ చేశాడు. సోమవారం రోజున చెపాక్ స్టేడియం వేదికగా కోల్కతాతో జరిగిన పోరులో తన సత్తా చాటాడు. మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకుని చెన్నై గెలుపులో కీలకమయ్యాడు.

అయితే ఈ స్టార్ క్రికెటర్ ఈ మ్యాచ్లో చేసిన అల్లరి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. జడేజా చేసిన పనికి ధోనీ ఫ్యాన్స్.. మమల్ని ప్రాంక్ చేశావ్ కదా గురూ అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే ?

 

మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగుతున్న సమయంలో నాలుగో స్థానంలో వచ్చిన శివవ్ దుబె ఔటవ్వగా తమ ఫేవరట్ స్టార్ ధోనీ క్రీజులోకి ఎంట్రీ ఇచ్చే మూమెంట్ కోసం ఫ్యాన్స్ చాలా ఈగర్గా ఎదురుచూస్తున్నారు. స్టేడియంలో అందరూ ధోనీ ధోనీ అంటూ అరవడం మొదలెట్టారు. అయితే సరిగ్గా అదే సమయంలో బ్యాట్ పట్టుకుని జడేజా డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు రావడంతో ‘ఏంటి ధోని బ్యాటింగ్కు రావట్లేదా’ అని అంతా షాకయ్యారు. అయితే బయటకి వచ్చినట్లే వచ్చి నవ్వుకుంటూ జడ్డూ మళ్లీ డగౌట్లోకి వెళ్లిపోయాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు జడేజా భాయ్.. భలే ప్రాంక్ చేశావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news