మరో కొత్త రికార్డుకి చేరువలో కెప్టెన్ కోహ్లీ..

-

భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ కోహ్లీకి రికార్డులు సృష్టించడం అంత పెద్ద విషయమే కాదు. బ్యాట్స్ మెన్ గా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన కోహ్లీ, తాజాగా మరో కొత్త రికార్డుకి చేరువలో ఉన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై విజయం సొంతం చేసుకున్న టెస్ట్ సిరీస్ లో భాగం కాలేకపోయిన కోహ్లీ, తాజాగా ఇంగ్లండ్ తో జరిగే ఆటలో బరిలో దిగనున్నాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ గా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో క్లైవ్ లాయిడ్ ని వెనక్కి నెట్టి నాలుగవ స్థానంలో నిలిచేలా ఉన్నాడు.

క్లైవ్ లాయిడ్ ని అందుకోవడానికి 14పరుగుల అవసరమే ఉన్నాయి. ఆ 14 పరుగులని చేరుకోగలిగితే టెస్టుల్లో కెప్టెన్ గా అత్యధిక పరుగులు చేసిన నాలుగవ ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం నాలుగవ స్థానంలో క్లైవ్ లాయిడ్ (5233 పరుగులు) ఉండగా, మూడవ స్థానంలో రికీ పాంటింగ్ (6542 పరుగులు), రెండవ స్థానంలో అలెన్ బార్డర్ (6623 పరుగులు), మొదటి స్థానంలో గ్రేమ్ స్మిత్ (8659 పరుగులు) ఉన్నారు. ప్రస్తుతం కోహ్లీ 5220 పరుగులతో ఐదవ స్థాన్ంలో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news