IPL 2023 : చెన్నై స్టేడియంలో సీట్లకు రంగులు వేసిన ధోని.. వీడియో వైరల్

-

మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ 2023 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ జట్టులన్నీ తమ హోం సిటీలకు చేరుకొని… ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఇక ఈ నేపథ్యంలోనే ధోని కూడా తన ప్రాక్టీస్ ఇప్పటికే మొదలుపెట్టాడు. ఈ తరుణంలోనే మిస్టర్ కూల్ ధోని మరోసారి తన సింప్లిసిటీ చాటుకున్నాడు.

చెన్నై చపాక్ స్టేడియం ప్రేక్షకుల గ్యాలరీలోని కుర్చీలకు స్వయంగా… ఎల్లో మరియు బ్లూ పెయింటింగ్ వేశారు. ఈ వీడియోను సీఎస్కే ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అది కచ్చితంగా ఎల్లో కలర్ లోనే కనిపిస్తుంది. సొంత గ్రౌండ్ లో ఏప్రిల్ మూడో తేదీన జరిగే మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాం అని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం రాసుకొచ్చింది. ఆ వీడియోకు ధోని డౌన్ టు ఎర్త్ పర్సన్ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news