Rohit Sharma: ఫైనల్‌ లో మట్టి తిన్న రోహిత్‌ శర్మ..వీడియో వైరల్‌

-

Rohit Sharma: ఫైనల్‌ లో మట్టి తిన్నారు రోహిత్‌ శర్మ. టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ఫుల్ ఎమోషనల్ అయిపోయారు. మ్యాచ్ అనంతరం పిచ్‌పైకి వచ్చి రెండుసార్లు చిటికెడు పట్టిని తిన్నారు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు.. ఆ మట్టిని రుచి చూడటం ద్వారా దానిపై మమకారాన్ని, గౌరవాన్ని చెప్పకనే చెప్పాడని కామెంట్స్ చేస్తున్నారు.

Emotional Rohit Sharma eats soil of Barbados pitch after winning T20 World Cup 2024

కాగా, టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 176-8 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా 8 వికెట్లు కోల్పోయి 169 రన్స్ మాత్రమే చేసింది. బ్యాటింగ్‌లో క్లాసెన్ 52, డికాక్ 39, స్టబ్స్ 31, మిల్లర్ 21 రన్స్ చేశారు. భారత బౌలర్లలో పాండ్యా 3, అర్ష్‌దీప్, బుమ్రా తలో వికెట్లు తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news