RCB vs PBKS : ఇదేం పిచ్చిరా..కోహ్లీ కాళ్లపై పడిపోయిన ఫ్యాన్స్‌ !

-

Virat Kohli: ఐపీఎల్ 2024 టోర్నమెంటులో భాగంగా… నిన్న బెంగళూరు వర్సెస్ పంజాబ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో ఆర్సిబి జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏకంగా నాలుగు వికెట్ల తేడాతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఆరు వికెట్లు నష్టపోయి 176 పరుగులు చేసింది.

Fan breaches security to hug Virat Kohli and touch his feet during RCB vs PBKS

శిఖర్ ధావన్ 45 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన… ఆర్సిబి జట్టు మొదటి నుంచి అటాకింగ్ గా ఆడింది. ఇక ఈ నేపథ్యంలోనే 19.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది బెంగళూరు. దీంతో ఈ టోర్నమెంట్ లో మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది బెంగళూరు. ఇందులో విరాట్ కోహ్లీ 77 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో విరాట్ కోహ్లీకి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే.. ఈ మ్యాచ్‌ లో కోహ్లీ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఓ ఫ్యాన్‌ గ్రౌండ్‌ లో కి వచ్చి… కోహ్లీ కాళ్లపై పడిపోయాడు. ఈ సంఘటన వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news