టీమిండియాకు శాపం..అప్పుడు ధోనికి, ఇప్పుడు హర్మన్ !

-

మహిళల టీ20 ప్రపంచ కప్ 2023 నుంచి భారత జట్టు ఇంటిముఖం పట్టింది. కేప్ టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీఫైనల్ లో ఐదు పరుగుల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. ఆఖరి వరకు భారత అద్భుతంగా పోరాడినప్పటికీ, ఓటమి మాత్రం తప్పలేదు.

కాగా హర్మన్ రనౌట్ ను 2019 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రనౌట్ తో పోల్చుతూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. 2019 వన్డే ప్రపంచకప్ లోను భారత్ ఈ విధంగానే సెమీస్ లో ఓటమిపాలైంది.

మంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ లో ధోని కూడా హార్మోన్ లాగే దురదృష్టకర రీతిలో రన్ అవుట్ అయ్యాడు. భారత్ విజయానికే 10 బంతుల్లో 25 పరుగులు అవసరమైన దశలో మార్టిన్ గుప్టిల్ డైరెక్టర్ త్రో ద్వారా ధోనీను పెవీలియన్ కు పంపాడు. దీంతో మ్యాచ్ కివిస్ వైపు మలుపు తిరిగింది. ఆ మ్యాచ్ లో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.

Read more RELATED
Recommended to you

Latest news