రోహిత్ ఫాన్స్ కి గంగూలీ గుడ్ న్యూస్…!

-

ఆస్ట్రేలియా పర్యటనకు గానూ టీం ఇండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపధ్యంలో… బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేస్తూ రోహిత్ ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్టులోకి వచ్చే అవకాశాలపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

రోహిత్ తన ఫిట్‌నెస్‌ ను నిరూపిస్తే సెలెక్టర్లు తమ వైఖరిని ఖచ్చితంగా పునఃపరిశీలిస్తారని గంగూలీ చెప్పారు. రోహిత్ ఆస్ట్రేలియాకు సరిపోతాడని మేము అనుకుంటున్నామని అన్నాడు. ఏదో ఒక దశలో అతను ఆరోగ్యంగా ఉంటే, సెలెక్టర్లు అతని స్థానాన్ని పునరాలోచించుకుంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను,”అని గంగూలీ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యులో పేర్కొన్నాడు. ప్రస్తుతం రోహిత్ ఐపిఎల్ కి కూడా దూరంగానే ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news