క్రికెట్ ఫాన్స్ కి గుడ్ న్యూస్… క్రికెట్ మ్యాచ్ లకు రావొచ్చు

-

భారత్ లో క్రికెట్ అభిమానులకు ఒక శుభవార్త చెప్పింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్. రాబోయే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్ లో 50 శాతం ఫాన్స్ ని ఆహ్వానించాలి అనే ఆలోచనతో బిసిసిఐ ఉంది. అన్ని వేదికలలో (చెన్నై, అహ్మదాబాద్ మరియు పూణే) అభిమానులను అనుమతిస్తారు. అయినప్పటికీ… కొన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాలు తమ స్టేడియంలలో మొత్తం ప్రేక్షకుల సామర్థ్యంలో 20 లేదా 25 శాతం అనుమతించవచ్చని ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం.

చివరిసారిగా భారత్ లో అభిమానులను 2020 జనవరిలో ఆస్ట్రేలియా… భారత్ వన్డే సిరీస్ కి అనుమతించారు. రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కూడా ఫాన్స్ లేకుండానే జరిగింది. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ కూడా అభిమానుల హాజరు కాకుండానే జరుగుతోంది. మొత్తంమీద, ఆస్ట్రేలియా తరువాత అభిమానులను స్టేడియంలోకి అనుమతించే మొదటి అతిపెద్ద క్రికెట్ దేశం భారత్ అవుతుంది.

దక్షిణాఫ్రికాతో జరిగిన భారత పరిమిత ఓవర్ల సిరీస్ 2020 మార్చిలో చివరి క్షణాల్లో వాయిదా పడింది. 13 వ ఎడిషన్ ఐపిఎల్ దాదాపు ఆరు నెలల ఆలస్యం తర్వాత ప్రారంభమైంది. భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో అప్పుడు దుబాయ్ లో మ్యాచ్ లను నిర్వహించారు. దీనిపై ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news