IPL 2024: SRH ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్

-

కాసేపట్లో ఉప్పల్ వేదికగా ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం రానుంది. పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇప్పటికే ప్లే ఆఫ్స్ కి చేరుకుంది సన్ రైజర్స్. ప్రస్తుతం 15 పాయింట్ల తో మూడో స్థానంలో ఉన్న SRH… ఈ మ్యాచ్ గెలిస్తే సెకండ్ ప్లేస్ కి వెళ్లనుంది. మధ్యాహ్నం 3.30 కి మ్యాచ్ ప్రారంభం కానుంది. హైదారాబాద్ వేదికగా ఇప్పటివరకు జరిగిన 6 మ్యాచులు సాయంత్రం జరగగా… చివరి మ్యాచ్ మాత్రం మధ్యాహ్నం జరగనుంది.

Good news for SRH fans

అయితే… హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ కు వర్షం ముప్పు లేదని వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ మహానగరంలో తేలికపాటి వర్షం పడే ఛాన్స్ ఉన్నా కూడా మ్యాచ్ మధ్యాహ్నం జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి ఆటంకం కలిగించే అవకాశం లేదని పేర్కొంది. ఉప్పల్ వేదికగా కాసేపట్లో జరగనున్న ఈ మ్యాచ్లు హైదరాబాద్ జట్టు గెలిస్తే 17 పాయింట్స్‌ తో రెండవ స్థానానికి వెళుతుంది. అదే సమయంలో రాత్రి మ్యాచ్లో కోల్కత్తా చేతిలో రాజస్థాన్ ఓడితే అదే ప్లేస్ ఖరారు అవుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news