IND vs BAN: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

-

భారత్ – బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య జరుగుతున్న మొదటి టీ – 20లో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా అనూష బారెడ్డి, మిన్ను మనీ భారత జట్టులో అరంగేట్రం చేశారు. అనంతపురం జిల్లా నార్సాల మండలం బండ్లపల్లికి చెందిన అనూషకు కెప్టెన్ హార్మోన్ ప్రీత్ కౌర్ క్యాప్ అందించి జట్టులోకి స్వాగతం పలికారు. కాగా అనూష నిరుపేద కుటుంబం నుండి ఎదిగి జాతీయ జట్టులో చోటు సాధించడం పై హర్షం వ్యక్తం అవుతుంది.

ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అభిమాని. భారత జట్టు వివరాలు : షఫాలీ వర్మ, స్మృతి మందాన, జమీమా రోడ్రిగ్స్, హర్లిన్ డియోల్, హర్మన్ ప్రీత్ కౌర్ ( కెప్టెన్), యాస్తికా భాటియా ( వికెట్ కీపర్ ), దీప్తి శర్మ, పూజ వస్త్రాకర్, అమన్జ్యోత్ కౌర్, బారెడ్డి అనూష, మిన్ను మణి.

Read more RELATED
Recommended to you

Latest news