ఒలింపిక్స్ : మెడల్ మ్యాచ్ లో భారత్ ఓటమి..!

-

భారత ఆర్చర్లు మరోసారి నిరాశపరిచారు. మిక్స్డ్ ఆర్చరీ ఈవెంట్ లో కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్ లో భారత జట్టు 2-6 తేడాతో US చేతిలో ఓడిపోయి 4వ స్థానంతో సరిపెట్టుకుంది. సెమీస్ లో సౌత్ కొరియా చేస్తిలో ఓడిపోయిన అంకిత, ధీరజ్ అమెరికా జట్టుతో కాంస్య పతకం కోసం పోటీ పడ్డారు. కానీ ఈ మ్యాచ్ లో అంకిత చేసిన తప్పుల వల్ల పతకం దూరం అయ్యింది అని చెప్పాలి.

మ్యాచ్ లోని మొదటి రెండు సెట్ లలో ధీరజ్ 10 పాయింట్స్ స్కోర్ చేస్తూ రాణించినా.. అంకిత మాత్రం 7 పాయింట్స్ స్కోర్ చేసింది. దాంతో 4 పాయింట్స్ అమెరికా ఖాతాలోకి వెళ్లాయి. ఆ తర్వాత మూడో సెట్ లో గెలిచినా.. నాలుగో సెట్ లో రెండు సార్లు అంకిత 8 పాయింట్స్ స్కోర్ చేయడంతో US విజయం సులభం అయ్యింది. దాంతో 2-6 తేడాతో US కాంస్య పతకం అందుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version