Olympics : బ్రిటన్ పై భారత్ విజయం.. సెమీస్ కి చేరిన హాకీ జట్టు

-

పారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా బ్రిటన్ తో జరిగిన క్లిష్టతరమైన మ్యాచ్ లో ఎవ్వరూ ఊహించనివిధంగా విజయం సాధించి సెమీ ఫైనల్ రేస్ లోకి వెల్లింది. ఉత్కంఠగా కొనసాగిన క్వార్టర్ ఫైనల్ లో భారత జట్టు 4-2 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది.

పెనాల్టీ షూటౌట్ లో గోల్స్ సాధించింది భారత హాకీ జట్టు. ఇవాళ జరిగిన మ్యాచ్ ఒక అద్భుతమనే చెప్పాలి. ఉత్కంఠ బరిలో 1-1 సమానంగా ఉన్నప్పటికీ.. పెనాల్టీ షూటౌట్ లో రెండు గోల్స్ సాధించి అధ్బుతమే సృష్టించింది. భారత జాతీయ హాకీ అయినప్పటికీ హాకీలో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ రాక చాలా ఏళ్లు అవుతుంది. ఇప్పటి వరకు 9 గోల్డ్ మెడల్స్ సాధించింది భారత్. ఈసారి సెమీస్ లోకి వెళ్లడంతో మరో గోల్డ్ మెడల్ సాధించే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news