ఒలింపిక్స్ : క్వాటర్స్ లో ఓడిన భారత రెజ్లర్..!

-

ఒలింపిక్స్ లో భారత పతకాల ఆశలు సన్నగిల్లుతున్నాయి. బ్యాట్మెంటన్, ఆర్చరీలో ఒక్క పతకం కూడా అందుకోలేకపోయిన భారత్ రెజ్లింగ్ లోనైనా పతకాలు వస్తాయి అని కోరుకుంటుంది. అయితే తాజాగా మహిళల 68 కిలోల విభాగంలో క్వాటర్ ఫైనల్స్ కు వచ్చిన రెజ్లర్ నిషా ఓటమిని చవి చూసింది.

నార్త్ కొరియా రెజ్లర్ తో తలపడిన నిషా మొదటి హాఫ్ లో ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వలేదు. కానీ సెకండ్ హాఫ్ లో నిషా చేతికి దెబ్బ తాకింది. చివరి నిశం వరకు 7 పాయింట్స్ ల లిడ్ లో ఉన్న నిషా.. ఆ దెబ్బ వల్ల ప్రత్యర్థికి వరుస పాయింట్స్ పాయింట్స్ ఇచ్చింది. మాదేలో రెండుసార్లు చేతికి పట్టి మార్చుకొని ఆడిన నార్త్ కొరియా రెజ్లర్ అటాకింగ్ లోకి దిగడంతో నిషా ఏం చేయలేకపోయింది. దాంతో చివరకు 8-10 తేడాతో నార్త్ కొరియా రెజ్లర్ పై ఓడిపోయింది. అనంతరం అక్కడే మ్యాట్ పై పడుకొని ఏడ్చేసింది నిషా.

Read more RELATED
Recommended to you

Exit mobile version