పంజాబ్ టార్గెట్ ఎంతంటే..?

-

ఐపీఎల్ లో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జేయింట్స్ మధ్య 11వ మ్యాచ్ జరుగుతోంది. లక్నో సూపర్ జేయింట్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణిత 20 ఓవర్లలో 199 స్కోరు చేసింది. ఓపెనర్లు డీకాక్ (54 ) హాప్ సెంచరీ చేశాడు. రాహుల్ 15 పరుగులకే ఔట్ అయ్యాడు. మార్కస్ స్టోయినెస్ 19 పరుగులు చేశాడు. కొత్త కెప్టెన్ నికోలస్ పూరన్ (42) హాప్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. చివరి ఓవర్లలో కృణాల్ పాండ్యా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 

ప్రారంభంలో బాగానే ఆడినప్పటికీ చివరికీ టప టప వికెట్లు పడిపోయాయి. అయినప్పటికీ కృణాల్ పాండ్యా రెచ్చిపోయాడు. 22 బంతుల్లో 43 పరుగులు చేశాడు. చివరి ఓవర్ లో 200 పరుగులు వస్తాయనుకుంటే.. హర్షల్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో 199 పరుగులు మాత్రమే చేయగలిగింది లక్నో సూపర్ జేయింట్స్. పంజాబ్ కింగ్స్ ఈ టార్గెట్ ని ఛేదిస్తుందో లేదో వేచి చూడాలి మరీ. 

Read more RELATED
Recommended to you

Latest news