జ‌ర్మ‌న్ ఓపెన్‌లో పీవీ సింధు, సైనా ఓట‌మి.. టోర్నీ నుంచి అవుట్

-

జ‌ర్మ‌న్ ఓపెన్ సూప‌ర్ 300 నుంచి భార‌త స్టార్ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ పీసీ సింధు నిష్క్ర‌మించింది. ఈ రోజు రెండో రౌండ్ లో పీవీ సింధు.. త‌న కన్న తక్కువ ర్యాంక్ ఉన్న చైనా ప్లేయ‌ర్ జాంగ్ ఈ మాన్ చేతిలో దారుణంగా ఓట‌మి పాలైంది. తొలి సెట్ ను 14-21 తో ఓడింది. కానీ రెండో సెట్ లో 21-15 తో గెలిచింది. అయితే నిర్ణ‌యాత్మ‌క‌మైన చివ‌రి సెట్ లో 14-21 తో ఓట‌మి పాలైంది. దీంతో సింధు టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది.

కాగ ఈ రోజు సింధు తో పాటు సైనా నెహ్వాల్ కూడా ఓడింది. సైనా థాయ్ లాండ్ ప్లేయ‌ర్ ర‌చ‌నాక్ ఇంట‌నాన్ చేతిలో 10-21, 15-21 వ‌రుసగా రెండు సెట్ ల‌లో ఓడింది. దీంతో సైనా నెహ్వాల్ కూడా ఈ టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. కాగ మెన్స్ విభాగంలో కిదాంబి శ్రీ‌కాంత్ త‌న జోరును కొన‌సాగిస్తున్నాడు. ఈ రోజు రెండో రౌండ్ లో చైనా కు చెందిన గువాంగ్ పై 21-16, 21-23, 21-18 తేడాతో విజ‌యం సాధించాడు. దీంతో కిదాంబి శ్రీ‌కాంత్.. జ‌ర్మ‌న్ ఓపెన్ లో క్వార్ట‌ర్ ఫైన‌ల్ కు దూసుకెళ్లాడు. కాగ శ్రీ‌కాంత్ ఇటీవ‌లే.. ప్ర‌పంచ ఛాంపియ‌న్ షిప్స్ లో ర‌జిత ప‌త‌కం సాధించి సూప‌ర్ ఫామ్ లో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news