WI VS IND TEST:ఇండియా విజయానికి వరుణుడు అడ్డుపడతాడా ?

-

ట్రినిడాడ్ వేదికగా ఇండియా మరియు వెస్ట్ ఇండీస్ ల మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ లో ఇండియా ఇప్పటి వరకు పైచేయి సాధించింది. ఈ టెస్ట్ లో చివరి రోజు కావడంతో ఫలితం తేలే సమయం దగ్గర్లోనే ఉంది. కానీ దురదృష్టవశాత్తూ అర గంట నుండి వర్షం పడుతోంది. వెస్ట్ ఇండీస్ ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే 289 పరుగులు చేయాల్సి ఉంది. అదే విధంగా ఇండియా కనుక విజయం సాధించాలంటే మరో ఎనిమిది వికెట్లు పడగొట్టగలిగితే మ్యాచ్ ను మరియు సిరీస్ ను సొంతం చేసుకుంటుంది. క్రీజులో చందర్ పాల్ (24) మరియు బ్లాక్ వుడ్ (20) లు ఉన్నారు. వెస్ట్ ఇండీస్ కోల్పోయిన రెండు వికెట్లు కూడా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సాధించినవే కావడం విశేషం.

 

 

 

 

కాగా ఈ రోజు కేవలం 98 ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. వరుణుడు ఇండియా విజయాన్ని అడ్డుకునే ప్లాన్ లో ఏమైనా ఉన్నాడా ? లేదా అన్నది తెలియాలంటే పూర్తి ఓవర్ ల పాటు ఆట కొనసాగాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news