పారిస్ లో సెరెనా విలియమ్స్‌కు అవమానం

-

టెన్నిస్‌ స్టార్ సెరెనా విలియమ్స్‌కు పారిస్‌లో అవమానం జరిగింది. పారిస్‌ ఒలింపిక్స్‌కు కుటుంబంతో హాజరైన ఆమె ఓ రెస్టారెంట్కు వెళ్లగా అక్కడ వారులోపలికి అనుమతించకపోవడంతో ఆమె ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టింది. పారిస్‌లోని పెనిన్‌సులా రూఫ్‌ టాప్‌ రెస్టరెంట్ వేదికగా ఈ ఘటన జరిగింది. అసలేం జరిగిందంటే..?

పెనిన్‌సులా రూఫ్‌టాప్‌ రెస్టరెంట్‌లో తినేందుకు కుటుంబంతో కలిసి వెళ్లానని కానీ తనను లోపలికి అనుమతించలేదని సెరీనా తన పోస్టులో పేర్కొంది. సెరెనా పోస్టుపై పెనిన్‌సులా రెస్టరెంట్ స్టాఫ్‌ మాక్సిమ్ మన్నెవే స్పందిస్తూ.. ఆమె ఓ స్ట్రోలర్‌ (చిన్న పిల్లల బండి)తోపాటు మరొక మహిళ వచ్చారని ఆమె వచ్చేటప్పటికి కేవలం రెండు టేబుళ్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆ టేబుల్స్ అప్పటికే వేరే క్లయింట్స్‌ రిజర్వ్‌ చేసుకున్నారని .. అయితే సెరీనా వచ్చినప్పుడు తాను లేనని క్లారిటీ ఇచ్చారు. ఆమెను తన కొలీగ్ గుర్తించకపోవడంతో ఈ సమస్య వచ్చిందని.. ఆమె ఎవరో తెలియకపోవడంతో ఇతర క్లయింట్స్‌కు చెప్పినట్లే ఆమెకు కూడా సమాధానం ఇచ్చాడని మాక్సిమ్ వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news