లంక ముందు కొండంత లక్ష్యం..!

-

శ్రీలంకతో మూడు T20ల సిరీస్ లో భాగంగా మొదటి నేడు మొదటి మ్యాచ్ లో తలబడుతున్న భారత జట్టు అద్భుతమైన బ్యాటింగ్ తో రాణించి… లంక ముందు కొండంత లక్ష్యం ఉంచింది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ కు వచ్చిన భారత జట్టుకు ఓపెనర్లు గిల్(40), జైస్వాల్(34) మంచి ఆరంభం అందించారు. కానీ వరుస ఓవర్లలో పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్(58) అర్ధ శతకంతో మెరిశాడు. అలాగే భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్(49) కూడా తన వరల్డ్ కప్ ఫామ్ ను కొనసాగించాడు.

కానీ వరల్డ్ కప్ లో మంచి బ్యాటింగ్ తో రాణించిన పాండ్య దారుణంగా విఫలం కావడం.. డెత్ ఓవర్ లలో లంక బౌలర్లు మంచి బంతులు సాధించడంతో టీమిండియా నిర్ణిత 20 ఓవర్లలో 213 పరుగులు చేసింది. అయితే ఈ కొండత లక్ష్యాన్ని లంక బ్యాటర్లు ఛేదిస్తారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version