సూపర్ ఓవర్ లో టీం ఇండియా విన్..!

-

ఉత్కంట గా సాగిన సూపర్ ఓవర్ లో టీం ఇండియా విజయం సాధించింది. కివీస్ నుంచి ఓపెనర్ మార్టిన్ గుప్తిల్,  కెప్టెన్ విలియమ్సన్ బరిలోకి దిగారు. బూమ్రా బౌలింగ్ చేసాడు. ఆరు బంతుల్లో కివీస్ తొలి రెండు బంతులకు రెండు పరుగులు చేయగా తర్వాతి బంతికి విలియమ్సన్ సిక్స్, నాలుగో బంతికి ఫోర్ కొట్టాడు. 5 బంతికి లెగ్ బై రాగా ఆరో బంతికి గుప్తిల్ ఫోర్ కొట్టాడు.

ఆ తర్వాత ఆరు బంతుల్లో 18 పరుగులు అవసరం కాగా టీం ఇండియా తరుపున బరిలోకి రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ దిగారు. టీం సౌథీ బౌలింగ్ చేసాడు. తొలి బంతికి రెండు పరుగులు రాగా రెండో బంతికి ఒక పరుగు వచ్చింది మూడో బంతికి రాహుల్ ఫోర్ కొట్టాడు నాలుగో బంతికి ఒక పరుగు వచ్చింది. అయిదో బంతికి రోహిత్ సిక్స్ కొత్తగా ఆరో బంతికి సిక్స్ కొట్టాడు.

తొలుత రోహిత్, రాహుల్ తడబడ్డారు. దీనితో ఆఖరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరం కాగా రోహిత్ వరుసగా రెండు సిక్సులు కొట్టడంతో టీం ఇండియా విజయం సాధించింది. దీనితో 5 మ్యాచుల సీరీస్ లో టీం ఇండియా మరో రెండు మ్యాచులు మిగిలి ఉండగానే సీరీస్ కైవసం చేసుకుంది. నాలుగో మ్యాచ్ ఇరు జట్ల మధ్య వెల్లింగ్టన్ లో ఎల్లుండి జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news