ఐపిఎల్ 2023 లో ఫస్ట్ డబుల్ సెంచరీ… హైదరాబాద్ ముందు కొండంత లక్ష్యం !

-

ఐపిఎల్ 2023 లో మొదటి ఆదివారం జరుగుతున్న డబుల్ హెడర్ లో భాగంగా రాజస్థాన్ మరియు హైదరాబాద్ ల మధ్యన ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ముందుగా హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. బ్యాటింగ్ తీసుకున్న రాజస్థాన్ నిర్ణీత ఓవర్ లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసి హైదరాబాద్ ముందు 204 పరుగులు భారీ లక్ష్యాన్ని ఉంచింది. స్టార్టింగ్ లో జోరుగా సాగిన రాజస్థాన్ ఇన్నింగ్స్ బట్లర్ ఔట్ అయిన తర్వాత నుండి బాగా నెమ్మదించింది. చివరికి శాంసన్ మరియు హెట్ మైర్ వేగంగా పరుగులు చేయడంతో 203 కు పరిమితం అయింది.

ఈ సీజన్ లో జట్టు స్కోరు 200 దాటడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. కాగా రాజస్థాన్ లో బట్లర్ 54, జైస్వాల్ 54, శాంసన్ 55, హెట్ మెయిర్ 22 పరుగులు చేశారు. ఈ ఇన్నింగ్స్ లో మొత్తం 8 సిక్సులు మరియు 21 ఫోర్లు నమోదు అయ్యాయి. హైదరాబాద్ బౌలర్లలో ఫజల్ మరియు నటరాజన్ లు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. మరి హైదరాబాద్ ఈ లక్ష్యాన్ని చేదించగలదా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version