రూల్స్ తట్టుకోలేక… 30 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీలంక క్రికెటర్

-

శ్రీలంక క్రికెటర్‌ భానుక రాజపక్స సంచలన నిర్నయం తీసుకున్నాడు. 30 ఏళ్ల వయసులోనే ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కు గుడ్‌ బై చెప్పాడు భానుక రాజపక్స. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్‌ బోర్డుకు లేఖ ద్వారా తెలియజేశాడు. కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత కారణాల వల్ల వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశాడు. లంక బోర్డు సైతం ఈ విషాయాన్ని అధికారికంగా దృవీకరించింది.

గతేడాది జూలైలో వన్డే క్రికెట్‌ లోకి అరంగేట్రం చేసిన రాజపక్స,..ఈ 30 ఏళ్ల లైఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌ కేవలం ఆర్నెళ్లు మాత్రమే జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా తన కెరీర్‌ లో 5 వన్డేలు, 18 టీ 20 లు ఆడి 409 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్థ శతకాలు ఉన్నాయి. టీ 20 ప్రపంచకప్‌ – 2021 బరిలోకి దిగిన శ్రీలంక జట్టులోనూ రాజపక్స ఉన్నాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన మూడో లంక బ్యాటర్‌ గా నిలిచాడు. అయితే.. శ్రీలంక పెట్టిన కొత్త రూల్స్‌ కారణంగానే భానుక రాజపక్స ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news