ఉద్యోగులు రాజకీయ పార్టీల్లాగా వ్యవహరించవద్దు : ఏపీ ప్రభుత్వం విప్‌

-

ఉద్యోగులు రాజకీయ పార్టీల్లాగా వ్యవహరించవద్దని ఏపీ ప్రభుత్వం విప్‌ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులను బానిసలుగా చూసిన కించ పరిచిన వారిని గత ప్రభుత్వంలో చూశామని.. బహిరంగ వేదికలపై ప్రభుత్వ ఉద్యోగులను అవమానించిన పరిస్థితి గతంలో ఉందన్నారు. కరోనా తో ఆర్థిక పరిస్థితులు దిగజారినా ఉద్యోగులు అడగక పోయినా సీఎం 27 శాతం ఐఆర్ ఇచ్చారని చెప్పారు.

ఐఆర్ ఇచ్చి ఉండక పోయి ఉంటే ప్రభుత్వంపై 18 వేల కోట్ల భారం పడి ఉండేది కాదని.. ఐఆర్ ఇవ్వకుండా ఉంటే పెండింగ్ లో ఉన్న చిన్న కాంట్రాక్టుల బిల్లులన్నింటినీ ప్రభుత్వం చెల్లించి ఉండేదని వెల్లడించారు. ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా చూస్తోందని.. ఉద్యోగులను నష్టపరుచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదరి తేల్చి చెప్పారు.

ద్వేషించే వారి ట్రాప్ లో ఉద్యోగులు పడవద్దని.. హెచ్ ఆర్ ఎ పై ప్రభుత్వం పునరాలోచన చేస్తుందని చెప్పారు. ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని.. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని స్పస్టం చేశారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకీ ప్రభుత్వం వేతనాలు పెంచిందని… ఉద్యోగులు పునరాలోచన చేయాలని కోరారు. ప్రభుత్వం ఎప్పుడూ మొండిగా పోదు.. ఉద్యోగులు అందరికీ న్యాయం జరుగుతుందని వెల్లడించారు. పదివేల కోట్ల భారం పడుతున్నా ప్రభుత్వం 23శాతం ఫిట్ మెంట్ ఇచ్చిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news