Breaking : అమరవీరుడు శ్రీకాంతచారి తండ్రి అదృశ్యం.. కేఏ పాల్‌ దగ్గర ఉండొచ్చు..

-

తెలంగాణ మలి దశ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి (55) అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ఈ నెల 1న మధ్యాహ్నం పని కోసం బయటకు వెళ్తున్నట్టు చెప్పిన ఆయన జాడ ఆ తర్వాత తెలియరాలేదు. అయితే, జూన్ 2న ఆయన సోషల్ మీడియాలో కనిపించారని వెంకటాచారి భార్య శంకరమ్మ పేర్కొన్నారు. ఆ తర్వాత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని అన్నారు. దీంతో హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వద్ద తన భర్త ఆశ్రయం పొందుతూ ఉండొచ్చని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో శంకరమ్మ అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

telangana martyr srikantha chary father goes missing his wife lodges police  complaint |Srikantha Chary Father: తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంతచారి  తండ్రి మిస్సింగ్..? పోలీసులకు శంకరమ్మ ...

ఇటీవల వెంకటాచారి కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటాచారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతున్నట్లు కేఏ పాల్ ప్రకటించారు. శ్రీకాంతచారి బలిదానం చేసుకున్న డిసెంబర్ 3న భారీ సభ నిర్వహిస్తామని… తెలంగాణ అసలైన ఆవిర్భావ దినోత్సవం అదేనని ప్రకటిస్తామన్నారు. ఈ సందర్బంగా వెంకటాచారి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అమరవీరులను విస్మరిస్తోందని ఆరోపించారు. విద్యార్థులు, నిరుద్యోగులు, అమరవీరులకు న్యాయం జరగాల్సి ఉందన్నారు. కేఏ పాల్ అమరవీరుల కుటుంబాలకు అండగా నిలబడేందుకు ముందుకు వచ్చారని అన్నారు. తెలంగాణలో కేఏ పాల్ సారథ్యంలో ఉద్యమిస్తామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news