ఎట్టకేలకు ఎన్ఐఏ వద్దకు శ్రీనివాస్

-

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై కోడి కత్తితో దాడి చేసిన శ్రీనివాస్ ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అడవివరం జైలు నుంచి ఎన్‌ఐఏ అధికారులు అర్థరాత్రి దాటిన తర్వాత ఒక సుమో వాహనంలో విశాఖ నుంచి విజయవాడకు తరలించారు. దీంతో నేడు విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నారు. మొత్తం 107 రోజుల పాటు విశాఖలో ఈ కేస్ విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన సిట్ దర్యాప్తుని ఎన్ఐఏ కి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news