శ్రీశైలం జలవిద్యుత్ ఏడో నెంబర్ యూనిట్‌లో పేలుడు శబ్దం!

-

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో మరోసారి ప్రమాదం చోటుచేసుకుంది. ఏడో నెంబర్ యూనిట్‌లో సంభవించిన భారీ పేలుడుపై చీఫ్ ఇంజినీర్ కాంతారావు స్పందించారు. మంగళవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో 7వ నెంబర్ జనరేటర్‌లో టెక్నికల్ సమస్య తలెత్తడంతో మెరుపులు వచ్చాయన్నారు. విషయం తెలిసిన వెంటనే సమస్యను పరిష్కరించామని చెప్పారు. అనంతరం వెంటనే తిరిగి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించినట్లు వెల్లడించారు.అయితే, మెరుపులు సంభించిన టైంలో భారీ శబ్దం రావడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారని ఆయన తెలిపారు.

ఇదిలాఉండగా, గతంలోనూ శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో భారీ ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. అనుకోకుండా విద్యుత్ ప్రమాదం చోటుచేసుకోవడంతో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో పదికి పైగా ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటన తెలంగాణ పరిధిలోని శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో సంభవించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ప్రమాదం చోటుచేసుకోవడంతో ఉద్యోగులు భయాందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version