నాగచైతన్యతో “ప్రేమమ్”చేసి పెద్ద తప్పు చేశా : శృతిహాసన్ సంచలనం !

-

శృతి హాసన్ గురించి సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సరైన విజయం లభించలేదు. అలాంటి సమయంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమాతో శృతి హాసన్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం లభించింది. గబ్బర్ సింగ్ సినిమా మంచి విజయం సాధించడంతో టాలీవుడ్ లో శ్రుతి హాసన్ కు క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి.

ఇటీవల రవితేజ తో నటించిన క్రాక్ సినిమా బంపర్ విజయం సాధించడంతో.. శృతి హాసన్ కు వరుసగా సినిమాల ఆఫర్లు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా తాజాగా నాగచైతన్య నటించిన ప్రేమమ్ సినిమా పై సంచలన వ్యాఖ్యలు చేసింది శృతిహాసన్. 2016 లో వచ్చిన ప్రేమమ్ సినిమాలో… మలర్ గా శృతిహాసన్ నటించింది.

అయితే మలయాళ ప్రేమం లో మలర్ గా కనిపించిన సాయి పల్లవి తో శృతి హాసన్ ను పోల్చుతూ ట్రోల్స్ కూడా వచ్చాయి. ఈ సమయంలోనే నిరుత్సాహానికి గురైన శృతి… అసలు ఆ పాత్ర చేసి ఉండాల్సింది కాదని అనుకున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే అది కాసేపే అని ఆ తర్వాత మళ్లీ నార్మల్ అయినట్లు తెలిపింది. మదర్ పాత్ర చేసినప్పుడు ప్రతిక్షణం ఎంజాయ్ చేశాను అని చెప్పింది. కాగా ప్రస్తుతం శృతి హాసన్.. బాలయ్య అలాగే సలార్ మూవీలో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news