Romantic: “వంక పెడితే.. ముసలోడివై పోయావని యూత్ గొడవ చేస్తారేమో..” ఆ మూవీపై జక్కన్న ఆసక్తికర వ్యాఖ్యలు

-

Romantic: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి, కేతికా శర్మ జంటగా నటించిన తాజా చిత్రం ‘రొమాంటిక్‌’. సినిమాను పూరీ జగన్నాథ్‌, ఛార్మీ కలిసి సంయుక్తంగా తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖుల కోసం హైదరాబాద్‌లోని ఓ మాల్‌లో ‘రొమాంటిక్‌’ సినిమా ప్రీమియర్‌ షో ఏర్పాటుచేశారు. ఈ క్ర‌మంలో చిత్రయూనిట్, సెలబ్రిటీల ప్రీమియర్‌ షోను వీక్షించి చిత్రం బాగుందని కితాబిచ్చారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క దిగ్గ‌జం రాజమౌళి స్పందిస్తూ ‘ఇప్పుడే సినిమా చూశాను. అద్భుతంగా ఉంది. సినిమా గురించి ఏదైనా వంక పెడితే ‘ముసలోడివై పోయావ్‌…నీకెం తెలుస్తుంది’ అని యూత్‌ అంతా గొడవ చేస్తారేమో న‌ని భయంగా ఉంది. ఈ సినిమా కంప్లీట్‌ యూత్‌ ఫుల్‌ ఎంటర్‌ టైనర్ గా తెర‌కెక్కింది.

డైరెక్ట‌ర్ తన మనసులో ఏం అనిపిస్తే.. ఎలాంటి లెక్కలు వేసుకోకుండా చిత్రాన్ని రూపొందించాడని ప్ర‌శంసించారు. ఆకాష్, కేతిక శర్మల జోడీ అద్భుతంగా ఉందని రాజమౌళి వెల్లడించారు.

ఇక ఆకాశ్‌ చిన్నప్పటి మంచి యాక్ట‌ర్ అని తెలుసు.. ఈ సినిమాతో ఆకాశ్ మరోమెట్టు పైకి ఏక్కాడ‌ని, ముఖ్యంగా క్లైమాక్స్‌లో తను ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ నన్నెంతగానో ఆకట్టుకున్నాయి. మన సినిమా ఇండస్ట్రీకి మరో అద్భుతమైన నటుడు దొరికాడని రాజమౌళి పేర్కొన్నారు. రాజమౌళి పాజిటివ్ గా రివ్యూ ఇచ్చిన ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది. ఆకాష్ పూరీ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news