ఆగిపోయిన గాంజా శంకర్ సినిమా.. కారణం అదేనా..?

-

విరూపాక్ష సినిమాతో తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలను అనౌన్స్ చేయకుండా కథలను ఎన్నుకోవడంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే.ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.ఇందులో గాంజా శంకర్ గా తేజ్ మాస్ లుక్ వేరే లెవల్లో ఉంది.

 

అయితే ఎప్పుడో షూటింగ్ పనులను ప్రారంభించినప్పటికి ఈ చిత్రం ఆగిపోవడానికి రెండు కారణాలు ఉన్నట్లు తెలుస్తుంది అందులో మొదటి కారణమేంటంటే ఈ సినిమాకి మొదటగా అనుకున్న బడ్జెట్ ప్రస్తుతం అవుతున్న బడ్జెట్ మధ్య వ్యత్యాసం భారీగా ఉండడమే కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రెండో కారణం ఏమిటంటే విరూపాక్ష హిట్ తో తన మార్కెట్ పెరగడంతో తేజ్.. తన తదుపరి సినిమా నుంచి రూ. 15 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news