వింత దొంగతనం.. లోదుస్తులు పోయాయని ఫిర్యాదు..!

-

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దొంగతనం చేసే విధానాలు కూడా మారిపోతున్నాయి. దొంగలు కూడా టెక్నాలజీని వాడుతూ సరికొత్త పద్దతిలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇక ఈ రోజు వరకు, మీరు దొంగతనాలకు సంబంధించి అనేక వింత కేసుల గురించి చదివి ఉంటారు. అయితే మనకు తెలిసినంత వరకు తరచుగా దొంగలు విలువైన వస్తువులతో పరార్ అయినట్లు పలు కేసుల గురించి విని ఉంటాం.

theif
theif

ఇక ఈసారి దొంగలు ఎలాంటి పనులు చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. మహిళల లోదుస్తులను దొంగిలించే దొంగను మీరు ఎప్పుడైనా చూశారా? వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఇలాంటి వింత కేసు ఒకదాని గురించి ఉత్తరప్రదేశ్‌లో గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. బహుశా.! ఇది విని దొంగలు సైతం ఒక్క క్షణం షాక్ అయి ఉంటారు.

అయితే ఈ వింత కేసు ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ నగరంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డు కాగా.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో స్కూటీపై ఓ ఇద్దరు యువకులు అమ్మాయి లోదుస్తులను దొంగిలించి పారిపోతున్నట్లు చూడవచ్చు. ఇదే వింత అనుకుంటే.. అక్కడ స్థానికంగా నివసిస్తున్న ప్రజలు ఇలాంటి సంఘటన గతంలోనూ జరిగిందని చెబుతున్నారు.

theif
theif

ఇక ఈ సంఘటనపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా.. పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తమ కూతురు లోదుస్తులను దొంగలించి.. ఏవైనా తాంత్రిక పూజలు నిర్వహిస్తారేమోనని సదరు బాలిక తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై, ఎ.ఎస్.పి సూరజ్ రాయ్ మాట్లాడుతూ బాలికల బట్టలు దొంగిలించే ఈ ప్రత్యేకమైన కేసుపై దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఓ యువకుడిని అరెస్ట్ చేయగా.. మరో వ్యక్తి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news