బ్రేకింగ్‌ : బీజేపీ ఎంపీపై గ‌ట్టి దెబ్బ కొట్టిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..

-

బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ లేఖ ద్వారా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సుజనా చౌదరి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని, దీనిపై విచారణ జరపాలని కోరుతూ రాసిన ఈ లేఖపై రామ్ నాథ్ కోవింద్ స్పందించారు. మరో లేఖ ద్వారా బదులిచ్చారు. రాష్ట్రపతి కార్యాలయం నోట్‌తో రీ-డైరెక్ట్‌ కావడంతో… ఆ లేఖను సంబంధిత శాఖలకు పంపిన హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ.

రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఆర్థిక నేరాలపై, ఆయన అక్రమ కంపెనీలపై, ఆయన మనీ లాండరింగ్‌ వ్యవహారాలపై, వ్యాపార కుంభకోణాలపై విచారణ జరపాలని రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. సుజనా చౌదరి అక్రమ వ్యవహారాలపై ఈడీ, సీబీఐ చేత ధర్యాప్తు చేయించాలని వైసీపీ ఎంపీ తన లేఖలో పేర్కొన్నారు. దీనిపై రాష్ట్రపతి నుంచి విజయసాయి రెడ్డికి బదులిస్తూ లేఖ వచ్చింది. దీంతో సుజనా చౌదరిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరపొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news