ఓవర్ టైం చేస్తున్న పుష్ప టీమ్… తగ్గేదే లే అంటున్న సుకుమార్

-

లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2 . ఈ సినిమాలో రష్మిక మందాన్న కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 ను రిలీజ్ చేయాలనీ మేకర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే.. షూటింగ్ ను శరవేగంగా పూర్తిచేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో షూటింగ్ ను త్వరగా పూర్తీ చేయడానికి షూట్ రెండు యూనిట్స్ పెట్టి, ప్రతి రోజు ఓవర్ టైం కూడా చేస్తున్నారని తెలుస్తోంది.

ఆగస్టు 15 మిస్ అయితే..అలాంటి డేట్ దొరకడం కష్టం. ఇప్పటికే ఆ డేట్ ను లాక్ చేసి పెట్టారు. ఈ లోపే పోస్ట్ ప్రొడక్షన్స్ పనులను మొదలుపెట్టకపోతే.. ప్రమోషన్స్ కు టైమ్ దొరకదు. అంతేకాకుండా మూవీ ఇంకా పూర్తి కాకపోతే వేరేవాళ్లు వచ్చి డేట్ ను లాక్ చేసుకొనే అవకాశం ఉంది. అందుకే ఎట్టి పరిస్థితిలోనూ షూటింగ్ ను పూర్తిచేయడానికి సుకుమార్ ఈ ప్లాన్ చేసినట్లు టాక్.

చిత్ర బృందం కూడా నిద్రాహారాలు మాని..పుష్ప 2 మూవీ కోసం కష్టపడుతున్నారట. పుష్ప-ది రైజ్ పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-ది రూల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news