అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకకు విచ్చేసిన మార్క్ జూకర్ బర్గ్

-

భారత దేశ అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక జామ్నగర్లోని రిలయన్స్ టౌన్షిప్ సమీపంలో మార్చి 1,2,3 తేదీలల్లో జరగనున్నాయి. ఇక ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకకు ప్రపంచ దేశాల నుంచి ప్రముఖులు తరలివస్తున్నారు.ఈ వేడుకలకు బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, దీపికా పదుకొణె , రణబీర్ కపూర్ వంటి బాలీవుడ్‌లోని ప్రముఖులు తరలిరానున్నారు.

 

తాజాగా ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ తన భార్య ప్రిసిల్లా చాన్తో కలిసి గుజరాత్లోని జామ్ నగర్ చేరుకున్నారు. వీరికి భారత సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. జామ్నగర్లో ఏర్పాటు చేసిన అల్ట్రా లగ్జరీ టెంట్లలో వీరు బస చేస్తారు.ఈ వేడుకకు .మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ , అడోబ్ సీఈవో శంతను నారాయణ్, డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెడ్ కుష్నర్‌తో కలిసి హాజరుకానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news