రవితేజ- డిజేటిల్లు ఎదురుపడి తొడగొడితే ఎలావుంటుంది..!!

-

తెలుగు సినిమాలలో స్టార్ హీరోల కాంబినేషన్లో సినిమా అంటే సహజంగానే అభిమానులలో ఆసక్తి అధికం వుంటుంది. ఎందుకంటే ఇద్దరు హీరోలను డైరెక్టర్ ఎలా చూపిస్తాడు.వారు ఎలా నటిస్తారు అనే విషయాలను అభిమానుల బాగా పట్టించుకుంటారు. లేటెస్ట్ గా వచ్చిన RRR సినిమాలో, రామ్ చరణ్ ను ,జూ ఎన్టీఆర్ లను రాజమౌళి సూపర్ గా చూపించిన విషయం తెలిసిందే. ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఇప్పుడు అంత రేంజ్ కాక పోయినా మంచి క్రేజ్ వున్న హీరోలతో మల్టీ స్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇటీవల కాలంలో తమిళనాడు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సినిమాలలో ఒక సినిమా’ మానాడు’..వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం శింబు కెరీర్ లోనే మంచి వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇందులో విలన్ పాత్ర డైరెక్టర్ SJ  సూర్య వేశాడు. ఈ పాత్ర కూడా హీరోతో సమానంగా ఆకట్టుకుంది.ఆద్యంతం ఉత్కంఠగా సాగే ఈ పొలిటికల్ థ్రిల్లర్ ని తెలుగు లో రీమేక్ చేసేందుకు సురేష్ బాబు హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కథని తెలుగు సినిమాకు  తగ్గట్టుగా మార్చే సత్తా కేవలం డైరెక్టర్ హరీష్ శంకర్ మాత్రమే ఉందని నమ్మిన సురేష్ బాబు ఆ బాధ్యతలను ఆయనకీ అప్పజెప్పాడని ప్రచారం జరుగుతోంది. అలాగే కథ లో హరీష్ చాలా మార్పులు చేసి  స్క్రిప్ట్ ను అద్భుతం గా మార్చాడట.ఇక ఈ సినిమా లో ప్రధాన పాత్రలు గా మాస్ మహా రాజా రవితేజ మరియు DJ టిల్లు సిద్దు జొన్నలగడ్డ ని తీసుకునే అవకాశం ఉందని సమాచారం. వీరితో ఈ సినిమా గురించి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎవరు ఏ పాత్ర వేస్తారో కాని ఇద్దరూ మంచి టిపికల్ డైలాగ్ డెలివరీ వున్న హీరోలు కావడంతో ఈ సినిమా  వర్క్ ఔట్ అయితే, ఖచ్చితంగా  బ్లాక్ బస్టర్ అవుతుందని పరిశ్రమలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news